భారత్ బయోటిక్స్ తెలంగాణకు గర్వకారణం: ఎంపీ కొత్త ప్రభాకర్

ABN , First Publish Date - 2021-01-16T17:59:59+05:30 IST

ఏడాది కాలంగా ప్రపంచాన్ని వణికించిన కరోనాకు టీకా వచ్చిందని... ఈ టీకాను మన రాష్ట్రానికి చెందిన భారత్ బయోటిక్స్ అభివృద్ధి చేయడం తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు.

భారత్ బయోటిక్స్ తెలంగాణకు గర్వకారణం: ఎంపీ కొత్త ప్రభాకర్

సంగారెడ్డి: ఏడాది కాలంగా ప్రపంచాన్ని వణికించిన కరోనాకు టీకా వచ్చిందని... ఈ టీకాను మన రాష్ట్రానికి చెందిన భారత్ బయోటిక్స్ అభివృద్ధి చేయడం తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. శనివారం జిల్లాలోని ఇందిరానగర్ అర్బన్ హెల్త్ సెంటర్‌లో కోవిడ్ - 19 వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఎంపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  జిల్లాలో 10341 మందికి టీకా వేస్తారని తెలిపారు. ఎటువంటి ఆందోళన, అపోహలు అవసరం లేదని చెప్పారు. మొదటి డోస్ తీసుకున్న వారు తిరిగి 28 రోజుల తరువాత రెండవ డోసు తీసుకోవాలన్నారు. కరోనా సమయంలో సీఎం కేసీఆర్ అందరినీ ఆదుకున్నారని చెప్పారు. వైరస్ వ్యాప్తి చెందకుండా గట్టి చర్యలు తీసుకున్నారని ఎంపీ కొత్తప్రభాకర్‌రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ హనుమంతరావు, డీఎంఅండ్‌హెచ్ఓ మోజీరాం రాథోడ్ పాల్గొన్నారు. 


Updated Date - 2021-01-16T17:59:59+05:30 IST