హర్ష కుటుంబ సభ్యులను ఓదార్చిన Bjp నేతలు
ABN , First Publish Date - 2022-02-24T17:21:13+05:30 IST
శివమొగ్గలో దారుణ హత్యకు గురైన బజరంగ్దళ్ కార్యకర్త హర్ష కుటుంబసభ్యులను బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, ఎంపీ నళిన్ కుమార్ కటీల్ బుధవారం ఓదార్చారు. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా
బెంగళూరు: శివమొగ్గలో దారుణ హత్యకు గురైన బజరంగ్దళ్ కార్యకర్త హర్ష కుటుంబసభ్యులను బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, ఎంపీ నళిన్ కుమార్ కటీల్ బుధవారం ఓదార్చారు. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కటీల్ వెంట మంత్రి ఈశ్వరప్పతో పాటు పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీవై విజయేంద్ర కూడా ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఈశ్వరప్ప మీడియాతో మాట్లాడుతూ హర్షను హత్యచేసిన గూండాలను ఇప్పటికే అరెస్టు చేశామని, ఆ కుటుంబానికి తగిన పరిహారం లభించేలా చూస్తామని చెప్పారు. ప్రతిపక్షాల ఆరోపణలపై స్పందిస్తూ హర్ష హత్య అనంతరం పరిస్ధితిని పోలీసులు అదుపులోకి తెచ్చారన్నారు. ప్రతిపక్షాల ఆరోపణలకు రానున్న రోజుల్లో తగిన సమాధానం లభించనుందని చెప్పారు. స్థానిక బీజేపీ నేతలు కూడా ఈ సందర్భంగా హాజరయ్యారు. హర్ష కుటుంబాన్ని పరామర్శించిన ఆయన అనంతరం జరిగిన హింసాకాండ ప్రాంతాల బాధితులను పరామర్శించకుండానే వెనుదిరిగారు.