రఘురామ బెయిల్ పిటిషన్.. శుక్రవారానికి విచారణ వాయిదా
ABN , First Publish Date - 2021-05-17T18:05:16+05:30 IST
సుప్రీంకోర్టులో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు బెయిల్ పిటిషన్పై వాదనలు ముగిశాయి.
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు బెయిల్ పిటిషన్పై వాదనలు ముగిశాయి. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. జస్టిస్ వినీత్ సరన్, జస్టిస్ బి. ఆర్. గవాయితో కూడిన ద్విసభ్య ధర్మాసనం.. మధ్యాహ్నం ఒంటి గంటకు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వనుంది. బెయిల్ పిటిషన్పై సమాధానం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. గురువారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాల్లో పేర్కొంది.