‘యేసయ్యా మరియ తనయా.. పూర్వా సంధ్యా ప్రవర్తతే’ అంటూ రఘురామ హెచ్చరిక

ABN , First Publish Date - 2020-10-21T21:42:06+05:30 IST

క్రైస్తవ మత వ్యాప్తిని అడ్డుకోకపోతే.. హిందూ ధర్మానికి అన్యాయం జరిగే అవకాశం ఉందని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు హెచ్చరించారు.

‘యేసయ్యా మరియ తనయా.. పూర్వా సంధ్యా ప్రవర్తతే’ అంటూ రఘురామ హెచ్చరిక

ఢిల్లీ: క్రైస్తవ మత వ్యాప్తిని అడ్డుకోకపోతే.. హిందూ ధర్మానికి అన్యాయం జరిగే అవకాశం ఉందని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు హెచ్చరించారు. ఢిల్లీలోని తన నివాసంలో బుధవారం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. ఒక మతాన్ని పోత్సహిస్తున్న ప్రభుత్వ చర్యలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. హిందూ స్వచ్ఛంద సంస్థలు కోర్టులను ఆశ్రయించాలని సూచించారు. రామరాజ్యాన్ని క్రైస్తవ రాజ్యం చేసే ప్రయత్నం చేస్తున్నారని రఘురామకృష్ణరాజు విమర్శించారు. ‘కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే.. ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్’ అంటూ మన చదువుకుంటున్న సుప్రభాతం..  ప్రభుత్వ చర్యలును అరికట్టక పోతే... ‘యేసయ్యా మరియ తనయా.. పూర్వా సంధ్యా ప్రవర్తతే’ అని పాడుకోవల్సిన ప్రమాదం ఉందని హెచ్చరించారు. 

Updated Date - 2020-10-21T21:42:06+05:30 IST