టీడీపీ నేతలు, కార్యాలయాలపై దాడులు దారుణం: ఎంపీ రఘురామ

ABN , First Publish Date - 2021-10-20T00:07:23+05:30 IST

టీడీపీ నేతలు, కార్యాలయాలపై దాడులు దారుణమని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. టీడీపీ నేత పట్టాభి ఇంటిపై దాడిని ఆయన ఖండించారు.

టీడీపీ నేతలు, కార్యాలయాలపై దాడులు దారుణం: ఎంపీ రఘురామ

అమరావతి: టీడీపీ నేతలు, కార్యాలయాలపై దాడులు దారుణమని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. టీడీపీ నేత పట్టాభి ఇంటిపై దాడిని ఆయన ఖండించారు. దాడి ఘటనపై తక్షణమే డీజీపీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్టీలతో సంబంధం లేకుండా నిందితులను అరెస్ట్ చేయాలని సూచించారు. 


కాగా ఏపీ వ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలు, నేతలపై వైసీపీ శ్రేణులు దాడులకు దిగాయి. పక్కా ప్రణాళికతో టీడీపీ కార్యాలయాలు, నేతల ఇళ్లపై దాడులు చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ నేతలు దాడి చేశారు. గేట్లు నెట్టుకొని టీడీపీ కేంద్ర కార్యాలయం లోపలికి వైసీపీ శ్రేణులు వెళ్లారు. కార్యాలయంలో కనపడినవారిపై దాడి, అద్దాలు పూర్తిగా ధ్వంసం చేశారు. విశాఖ, తిరుపతి, గుంటూరులోని టీడీపీ కార్యాలయాలపైనా వైసీపీ శ్రేణులు దాడులు చేశారు. టీడీపీ నేత పట్టాభి నివాసంపై కూడా దాడి జరిగింది. అంతేకాదు పలు విలువైన వస్తువులు ధ్వంసం చేశారు.  



Updated Date - 2021-10-20T00:07:23+05:30 IST