రఘురామరాజు పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు

ABN , First Publish Date - 2021-09-15T17:03:07+05:30 IST

నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌కు తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఏపీ సీఎం జగన్, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి బెయిల్ రద్దు పిటిషన్‌ను సీబీఐ కోర్టు నుంచి మరో కోర్టుకు బదిలీ చేయాలంటూ

రఘురామరాజు పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు

హైదరాబాద్: నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఏపీ సీఎం జగన్, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి బెయిల్ రద్దు పిటిషన్లను సీబీఐ కోర్టు నుంచి మరో కోర్టుకు బదిలీ చేయాలంటూ రాఘురామ రాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ పిటిషన్‌పై బుధవారం విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు.. జగన్‌, విజయసాయి బెయిల్‌ రద్దు పిటిషన్ల బదిలీకి నిరాకరణ తెలిపింది. రఘురామ రాజు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ నేపథ్యంలో జగన్‌, విజయసాయి బెయిల్‌ రద్దు పిటిషన్లపై కాసేపట్లో సీబీఐ కోర్టు తీర్పు వెలువరించనుంది.

Updated Date - 2021-09-15T17:03:07+05:30 IST