రాజ్యాంగ ఉల్లంఘనలపై ప్రధానికి లేఖ రాశా: ఎంపీ రఘురామ

ABN , First Publish Date - 2020-10-21T22:19:45+05:30 IST

బీసీల్లో కులానికో సొసైటీ పెట్టి చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని నర్సాపురం ఎంపీ రఘురామ రాజు ఆరోపించారు. విభజించి, పాలించే చర్యలను

రాజ్యాంగ ఉల్లంఘనలపై ప్రధానికి లేఖ రాశా: ఎంపీ రఘురామ

ఢిల్లీ: బీసీల్లో కులానికో సొసైటీ పెట్టి చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని నర్సాపురం ఎంపీ రఘురామ రాజు ఆరోపించారు.  విభజించి, పాలించే చర్యలను రాష్ట్ర ప్రభుత్వం ఆపాలన్నారు. రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘనపై ప్రధానికి లేఖ రాశానని తెలిపారు. రచ్చబండ కార్యక్రమంలో ఇవాళ మాట్లాడిన ఆయన.. 1.8 శాతం ఉన్న క్రైస్తవులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రాధాన్యతపై.. విచారణ జరిపి నిజాలు నిగ్గుతేల్చాలని ప్రధానిని కోరానన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల బ్యాలెట్‌లో.. తెలుగు భాషకు ప్రాధాన్యత ఇచ్చారని గుర్తు చేశారు. రాష్ట్రంలో రాజ్యాంగాన్ని చులకనగా భావించే ప్రభుత్వం.. తెలుగు భాషను కేంద్ర విద్యా విధానికి వ్యతిరేకంగా పనిచేస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను ఆంగ్లాంధ్రప్రదేశ్‌గా మార్చాలను చూస్తున్నారని విమర్శించారు. 

Updated Date - 2020-10-21T22:19:45+05:30 IST