ఆర్థిక మంత్రి ఎక్కువ కాలం ఢిల్లీలోనే ఉంటున్నారు: ఎంపీ రఘురామ

ABN , First Publish Date - 2021-08-05T20:48:31+05:30 IST

ఆర్థిక మంత్రి ఎక్కువ కాలం ఢిల్లీలోనే ఉంటున్నారు: ఎంపీ రఘురామ

ఆర్థిక మంత్రి ఎక్కువ కాలం ఢిల్లీలోనే ఉంటున్నారు: ఎంపీ రఘురామ

అమరావతి: ఏపీ ఆర్థిక మంత్రి ఎక్కువ కాలం ఢిల్లీలోనే ఉంటున్నారని ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. ఐదుగురు డిప్యూటీ సీఎంలులాగా ఐదుగురు ఆర్థిక మంత్రులను పెట్టుకుంటే బాగుంటుందని సూచించారు. విశాఖలోనీ హోటల్ రాడిసెన్ అమ్మకానికి ఒప్పుకోకపోతే అడ్డంగా రోడ్లు తవ్వే కొత్త టెక్నాలజీ ఉపయోగించి స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. బీచ్ రోడ్డులోని అనేక ఆస్తులను నయానో భయానో స్వాధీనం చేసుకుంటుండటంతో విశాఖ ప్రజలు భయబ్రంతులకు గురిఅవుతున్నారని ఆయన చెప్పారు. రాజకీయ కాలుష్యం కారణంగానే అమర్ రాజా కంపెనీ వెళ్లి పోతోందన్నారు. సీఎం జగన్ కక్షతోనే చేస్తున్నారని ఆరోపించారు. తమినాడులోని నా పరిశ్రమకు కూడా ఇబ్బందులు, ఆటంకాలు కల్పించారని చెప్పారు. జగన్ స్కీమ్స్ గురించి అటవీ, పర్యావరణశాఖ అధికారి విజయ్‌కుమార్ మాట్లాడటమేంటి? అని ప్రశ్నించారు. అధికారులు విచ్చలవిడిగా రాజకీయాలు మాట్లాడటం ఏంటి? అన్నారు. విజయ్‌కుమార్‌పై అటవీ శాఖమంత్రి భుపేంద్రయాదవ్‌కి ఫిర్యాదు చేస్తానని తెలిపారు. 

Updated Date - 2021-08-05T20:48:31+05:30 IST