ఎంపీ రఘురామకు ప్రత్యుత్తరం పంపిన అమిత్ షా

ABN , First Publish Date - 2021-12-27T18:19:20+05:30 IST

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌పై ఫిర్యాదు చేస్తూ ఎంపీ రఘురామకృష్ణం రాజు రాసిన లేఖపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా స్పందించారు.

ఎంపీ రఘురామకు ప్రత్యుత్తరం పంపిన అమిత్ షా

న్యూఢిల్లీ:  వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌పై ఫిర్యాదు చేస్తూ ఎంపీ రఘురామకృష్ణం రాజు రాసిన లేఖపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా స్పందించారు. ఎంపీ గోరంట్ల మాధవ్‌ తనను చంపేస్తాంటూ  పార్లమెంటు 4వ గేటు వద్ద బెదిరించిన విషయంపై చేసిన ఫిర్యాదు తనకు అందిందని ఎంపీ రఘురామ కృష్ణరాజుకు అమిత్‌ షా ప్రత్యుత్తరం పంపారు. వైసీపీ ఎంపీ గోరంట్ల బెదిరింపుపై  ఈనెల 8న ప్రధాని, స్పీకర్‌, కేంద్ర హోం మంత్రులకు ఎంపీ రఘురామ లేఖలు రాశారు. అసభ్య పదజాలంతో దూషిస్తూ తనను బెదిరించారని ఎంపీ అందులో పేర్కొన్న విషయం తెలిసిందే. 

Updated Date - 2021-12-27T18:19:20+05:30 IST