ఆంధ్రుల కలల రాజధాని కేసు కోర్టులో పెండింగ్లో ఉంది: రఘురామ
ABN , First Publish Date - 2021-10-19T21:25:35+05:30 IST
ఆంధ్రుల కలల రాజధాని కేసు కోర్టులో పెండింగ్లో ఉందని ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. అమరావతే ఏకైక రాజధానిగా ఉంటుందన్నారు.
ఢిల్లీ: ఆంధ్రుల కలల రాజధాని కేసు కోర్టులో పెండింగ్లో ఉందని ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. అమరావతే ఏకైక రాజధానిగా ఉంటుందన్నారు. ఏపీలో రోడ్లు వేయడానికి కూడా కాంట్రాక్టర్లు ముందుకు రాని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మూడు రాజధానుల నిర్మాణం సాధ్యంకాదని చెప్పారు. విద్యుత్ కోతలతో రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు రాలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. అమరావతిని రాజధానిగా ప్రకటిస్తే విశాఖ ప్రజలు అర్థం చేసుకుంటారని చెప్పారు. ఇప్పటికైన సీఎం అర్థం చేసుకుని అమరావతిని రాజధానిగా ప్రకటించాలని సూచించారు.