రఘురామను పేరు పెట్టి పిలిచి...భుజం తట్టిన ప్రధాని మోదీ
ABN , First Publish Date - 2021-11-26T19:40:30+05:30 IST
పార్లమెంటు సెంట్రల్ హాల్లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఎంపీ రఘురామకృష్ణరాజును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆప్యాయంగా పలకరించారు.
న్యూఢిల్లీ: పార్లమెంటు సెంట్రల్ హాల్లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఎంపీ రఘురామకృష్ణరాజును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆప్యాయంగా పలకరించారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పార్లమెంటు సెంట్రల్ హాల్లో శుక్రవారం ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీ రఘురామకృష్ణ రాజు హాజరయ్యారు. ముందు వరసలో కూర్చున్న ఎంపీ రఘురామను ముందుగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పలకించారు. ఆ తరువాత అటుగా వచ్చిన ప్రధాని మోదీ... రఘురామకృష్ణ రాజును పేరు పెట్టి పిలిచి కొంచెం సేపు నిలబడి భుజం తట్టి వెళ్లారు.