ఎంపీ సంతోష్‌కుమార్ ‘చాలెంజ్‌’.. గౌతంగంభీర్ స్వీకరణ..

ABN , First Publish Date - 2021-09-11T19:01:45+05:30 IST

ఢిల్లీ: రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్‌కు అంతర్జాతీయ క్రికెటర్, ఈస్ట్ ఢిల్లీ లోక్ సభ సభ్యుడు గౌతంగంభీర్ స్పందించారు. శనివారం ఆయన ఢిల్లీలోని తన నివాస ప్రాంగణం

ఎంపీ సంతోష్‌కుమార్ ‘చాలెంజ్‌’.. గౌతంగంభీర్ స్వీకరణ..

ఢిల్లీ: రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్‌కు అంతర్జాతీయ క్రికెటర్, ఈస్ట్ ఢిల్లీ లోక్ సభ సభ్యుడు గౌతంగంభీర్ స్పందించారు. శనివారం ఆయన ఢిల్లీలోని తన నివాస ప్రాంగణం వివేకానంద పార్క్‌లో మొక్కలు నాటారు. కార్యక్రమం అనంతరం గౌతం గంభీర్‌కు.. గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రతినిధి రాఘవ, వృక్ష వేదం పుస్తకాన్ని బహూకరించారు. ఈ సందర్భంగా గౌతం గంభీర్ మాట్లాడుతూ ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్.. అద్భుతమైన కార్యక్రమమని కొనియాడారు.


ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం రావడం సంతోషంగా ఉందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఒక్కో మొక్క నాటి, వాటిని సంరక్షించుకోవాలని చెప్పారు. ఈ బృహత్తర కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తానన్నారు. త్వరలోనే ట్విట్టర్ వేదికగా తాను కూడా మరో ముగ్గురికి సవాల్ విసురుతానని గంభీర్ పేర్కొన్నారు.



Updated Date - 2021-09-11T19:01:45+05:30 IST