బెంగాల్ తృణమూల్ ఉపాధ్యక్షురాలిగా శతాబ్ది
ABN , First Publish Date - 2021-01-18T07:25:28+05:30 IST
బెంగాల్ తృణమూల్ ఉపాధ్యక్షురాలిగా శతాబ్ది
కోల్కతా, జనవరి 17: తృణమూల్ అసమ్మతి నేత, ఎంపీ శతాబ్ది రాయ్ పార్టీ పశ్చిమ బెంగాల్ ఉపాధ్యక్షురాలిగా ఆదివారం నియమితులయ్యారు. మూడుసార్లు ఎంపీగా ఎన్నికైన రాయ్ కొంత కాలంగా పార్టీలో తిరుగుబావుటా ఎగురవేస్తున్నారు. ఆమె బీజేపీలో చేరబోతున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన నేతలు ఆమెతో చర్చలు జరిపారు.