కేసీఆర్‌కు సీఎం కుర్చీలో కూర్చునే అర్హత లేదు: ఉత్తమ్‌

ABN , First Publish Date - 2021-07-06T21:25:30+05:30 IST

కేసీఆర్‌కు సీఎం కుర్చీలో కూర్చునే అర్హత లేదని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

కేసీఆర్‌కు సీఎం కుర్చీలో కూర్చునే అర్హత లేదు: ఉత్తమ్‌

హైదరాబాద్: కేసీఆర్‌కు సీఎం కుర్చీలో కూర్చునే అర్హత లేదని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఏపీ 40 నుంచి 80 టీఎంసీలకు పెంచుతూ పోతిరెడ్డిపాడు విస్తరణ పనులు మొదలు పెట్టారని చెప్పారు. దాంతో నాగార్జున సాగర్ ఆయకట్టు ఎడారిగా మరే ప్రమాదం ఉందని హెచ్చరించారు. దీనికి పూర్తి బాధ్యత సీఎం కేసీఆర్‌దేనని చెప్పారు.నీటిపారుదల ప్రాజెక్టుల్లో 8 శాతం కమీషన్ ప్రభుత్వ పెద్దలకు ముడుతోందన్నారు. అవినీతి, నీటి ప్రాజెక్టుల అంశాన్ని పార్లమెంట్‌లో లెవనెత్తుతానని ఉత్తమ్‌ వ్యాఖ్యానించారు. నిరుద్యోగ భృతికి ఇప్పటివరకూ దిక్కులేదని టీఆర్ఎస్ సర్కారుపై ఉత్తమ్‌కుమార్‌రెడ్డి  ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2021-07-06T21:25:30+05:30 IST