పోలీసులు, అధికారులు ఆ ఎమ్మెల్యేకి చెంచాగిరి చేస్తున్నారు: ఉత్తమ్

ABN , First Publish Date - 2021-12-24T21:48:26+05:30 IST

పోలీసులు, అధికారులు స్థానిక ఎమ్మెల్యేకి చెంచాగిరి చేస్తున్నారని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు.

పోలీసులు, అధికారులు ఆ ఎమ్మెల్యేకి చెంచాగిరి చేస్తున్నారు: ఉత్తమ్

సూర్యాపేట:  పోలీసులు, అధికారులు స్థానిక ఎమ్మెల్యేకి చెంచాగిరి చేస్తున్నారని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నలభై ఏళ్ల చరిత్ర ఉన్న ఇందిరా గాంధీ విగ్రహాన్ని కూల్చటం అత్యంత బాధకరమన్నారు. రోడ్లు భవనాల శాఖ డీఈ గులాబీ చొక్కా వేసుకొని ఎమ్మెల్యే ఆఫీస్‌లో అటెండర్ ఉద్యోగం చేసుకుంటే బెటర్ అని చెప్పారు.కూల్చిన దగ్గరే ఇందిరా, వైఎస్సార్ విగ్రహాలు పెట్టేదాకా ఆహారం ముట్టుకోనని అన్నారు. ఇక్కడి నుంచి కదలను, నిరాహార దీక్ష కొనసాగిస్తాను, జైలుకి పోవడానికి కూడా సిద్ధమని ఎంపీ ఉత్తమ్ వ్యాఖ్యానించారు.  

Updated Date - 2021-12-24T21:48:26+05:30 IST