చంద్రబాబుపై విరుచుకుపడ్డ ఎంపీ విజయసాయి

ABN , First Publish Date - 2020-10-17T15:57:50+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబుపై ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు.

చంద్రబాబుపై విరుచుకుపడ్డ ఎంపీ విజయసాయి

విశాఖపట్నం: టీడీపీ అధినేత చంద్రబాబుపై ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. మహిళల భద్రతపై చంద్రబాబు మాట్లాడటం దయ్యలు వేదాలు వల్లించినట్లుందని వ్యాఖ్యానించారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ...‘‘మహిళల భద్రత గురించి బాబు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది. తాసిల్దార్ వనజాక్షి గారిపై చింతమనేని దాడి చేస్తే ఆమెదే తప్పని రౌడీని వెనకేసుకొచ్చిందెవరు? బీటెక్ విద్యార్థిని రిషితేశ్వరి ప్రాణాలు తీసినవారిని కాపాడింది మీరు కాదా?’’ అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. 



Updated Date - 2020-10-17T15:57:50+05:30 IST