అభివృద్ధి పనులపై దృష్టి సారించండి

ABN , First Publish Date - 2020-05-24T08:34:49+05:30 IST

గ్రామాల్లో అభివృద్ధి పనులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఎంపీడీవో ఎం.వి. సుబ్రమణ్యం అన్నారు.

అభివృద్ధి పనులపై దృష్టి సారించండి

దత్తిరాజేరు, మే 23: గ్రామాల్లో అభివృద్ధి పనులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని  ఎంపీడీవో ఎం.వి. సుబ్రమణ్యం అన్నారు. శనివారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో సిబ్బందితో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో ఆర్థిక వనరులు సమకూరే విధంగా ప్రణాళికలు రూపొందించాలన్నారు. పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఈవోపీఆర్డీ రవికుమార్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ జేఈ కె. సైలజ పాల్గొన్నారు.

Updated Date - 2020-05-24T08:34:49+05:30 IST