ఎంపీటీసీలకు సముచిత స్థానం కల్పించాలి

ABN , First Publish Date - 2021-06-24T06:57:30+05:30 IST

ప్రజలచేత ఎన్నికైన ఎంపీటీసీలకు పలు అధికారిక కార్యక్రమాల్లో సముచితన్యాయం కల్పించాలని ఎంపీపీ ఆప్క గజ్జారాం యాదవ్‌ అన్నారు.

ఎంపీటీసీలకు సముచిత స్థానం కల్పించాలి
కుంటాలలో మాట్లాడుతున్న ఎంపీపీ, ఎంపీటీసీలు

కుంటాల, జూన్‌ 23 : ప్రజలచేత ఎన్నికైన ఎంపీటీసీలకు పలు అధికారిక కార్యక్రమాల్లో సముచితన్యాయం కల్పించాలని ఎంపీపీ ఆప్క గజ్జారాం యాదవ్‌ అన్నారు. మంగళవారం నిర్మల్‌ జిల్లా కేంద్రంలో పల్లెప్రగతిపై నిర్వ హించిన సమీక్ష సమావేశంలో ఎంపీటీసీలకు సమాచారం ఇవ్వక పోవడం పట్ల బుధవారం రోజు కుంటాల మండల కేంద్రంలో పలువురు ఎంపీటీసీ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ ఆప్కగజ్జారాం యాదవ్‌, ఎంపీపీలు మాట్లాడుతూ ప్రజల చేత ఎన్నుకోబడిన తమకు గ్రామాల్లో ప్రజాసమస్యల పట్ల అవగాహణతో ఉన్నామని, కావున అధికారిక కార్యక్రమాల్లో తమకు సమాచారం అందిస్తే బాగుంటుందని వారు పేర్కొ న్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఆప్క గజ్జారాంయాదవ్‌, ఎంపీటీసీలు కట్టరవి, సుధాకర్‌, మదు, కో ఆప్షన్‌ సభ్యులు తదితరులున్నారు. 


Updated Date - 2021-06-24T06:57:30+05:30 IST