తహసీల్దార్‌, డిప్యూటీ తహసీల్దార్‌లకు అందని జీతాలు

ABN , First Publish Date - 2020-09-24T21:22:53+05:30 IST

రాష్ట్రంలోని పలువురు తహసీల్దార్‌, డిప్యూటీ తహసీల్దార్‌లకు జాతాలు ఇంకా అందలేదు. వివిధ జిల్లాల్లో తహసీల్దార్లను కలెక్టర్లు రీషఫ్లింగ్‌ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ రీషప్లింగ్‌ వల్ల పూర్తి కావాల్సిన కొన్ని సాంకేతిక పనులు పూర్తి

తహసీల్దార్‌, డిప్యూటీ తహసీల్దార్‌లకు అందని జీతాలు

అమరావతి: రాష్ట్రంలోని పలువురు తహసీల్దార్‌, డిప్యూటీ తహసీల్దార్‌లకు జాతాలు ఇంకా అందలేదు. వివిధ జిల్లాల్లో తహసీల్దార్లను కలెక్టర్లు రీషఫ్లింగ్‌ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ రీషప్లింగ్‌ వల్ల పూర్తి కావాల్సిన కొన్ని సాంకేతిక పనులు పూర్తి కాలేదని ఆ కారణంగానే ఉద్యోగులకు జీతాలు ఇంకా అందలేదని అధికారులు పేర్కొన్నారు. తమకు జీతాలు అందని తహసీల్దార్‌కు వెంటనే చెల్లింపులు జరిగేలా చూడాలని మంత్రి ధర్మానకు రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ నేతలు విజ్ఞప్తి చేశారు. సాంకేతికంగా పూర్తి చేయాల్సిన పనులు వీలైనంత తొందరలో పూర్తి చేసి జీతాలు విడుదల అయ్యేలా చూస్తామని మంత్రి ధర్మాన హామీ ఇచ్చారు.

Updated Date - 2020-09-24T21:22:53+05:30 IST