వివక్ష చూపితే ఆందోళన: ఎమ్మార్పీఎస్‌

ABN , First Publish Date - 2021-05-17T05:30:00+05:30 IST

బాపురం గ్రామంలో దళితుల స్థలాలలో ప్రభుత్వ భవనాలు నిర్మిస్తే ఆందోళన తప్పదని ఎమ్మార్పీఎస్‌ నాయకుడు లక్ష్మీనారాయణ సోమవారం హెచ్చరించారు.

వివక్ష చూపితే ఆందోళన: ఎమ్మార్పీఎస్‌

హాలహర్వి, మే 17: బాపురం గ్రామంలో దళితుల స్థలాలలో ప్రభుత్వ భవనాలు నిర్మిస్తే ఆందోళన తప్పదని ఎమ్మార్పీఎస్‌ నాయకుడు లక్ష్మీనారాయణ సోమవారం హెచ్చరించారు. గ్రామంలో దళితుల స్థలాల్లో తహసీల్దార్‌ సతీష్‌ కొలతలు వేయించడం సరికాదని అన్నారు. ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని వదిలి దళితుల స్థలాల్లో నిర్మాణాలు చేపట్టడం తగదని అన్నారు. ఎమ్మార్పీఎస్‌ నాయకులు తహసీల్దార్‌ను అడ్డుకోవడంతో ఎస్‌ఐ నరేంద్ర జోక్యం చేసుకుని సర్దిచెప్పారు. కార్యాలయంలో కూర్చుని చర్చించుకోవాలని చెప్పడంతో అధికారులు వెనుతిరిగారు.

Updated Date - 2021-05-17T05:30:00+05:30 IST