ఎల్‌వోసీ అందజేసిన ఎమ్మెల్యే మర్రి

ABN , First Publish Date - 2021-04-14T05:01:45+05:30 IST

మండల పరిధిలోని గడ్డంపల్లి గ్రామానికి చెందిన కుమార్‌ కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఎల్‌వోసీ అందజేశారు.

ఎల్‌వోసీ అందజేసిన ఎమ్మెల్యే మర్రి
బాధితుడికి ఎల్‌వోసీ అందిస్తున్న ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి

తెలకపల్లి, ఎఫ్రిల్‌ 13: మండల పరిధిలోని గడ్డంపల్లి గ్రామానికి చెందిన కుమార్‌ కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఎల్‌వోసీ అందజేశారు. కుమార్‌ కుటుంబ సభ్యులు ఒకరు హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఇంకా మెరుగైన చికిత్స కోసం డబ్బులు అవసరం ఉండడంతో ఎమ్మెల్యే తన నివాసంలో ఆయనకు సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన ఎల్‌ఓసీ అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కొమ్ము మధు, మాజీ జడ్పీటీసీ నరేందర్‌రెడ్డి, పార్టీ నాయకులు రాజేశ్వర్‌రెడ్డి, మదన్‌గౌడ్‌, రాము తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-04-14T05:01:45+05:30 IST