19న ఎమ్మెస్పీ రాష్ట్రస్థాయి సదస్సు
ABN , First Publish Date - 2021-01-18T04:52:56+05:30 IST
19న ఎమ్మెస్పీ రాష్ట్రస్థాయి సదస్సు
వడ్డెపల్లి, జనవరి 17: మహాజన సోషలిస్టు పార్టీ తొలి రాష్ట్రస్థాయి సదస్సును ఈ నెల 19న జిల్లా కేంద్రంలోని భీమారంలోని తులసీ గార్డెన్స్లో నిర్వహిస్తున్నామని మహాజన సోషలిస్టు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తీగల ప్రదీ్పగౌడ్ పేర్కొన్నారు. ఆదివా రం హన్మకొండ మండలం గోపాల్పూర్లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడా రు. సదస్సుకు ముందు ఉదయం 11గంటలకు హన్మకొండలోని అంబేద్కర్ విగ్రహం నుంచి భీమారం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సదస్సులో ఎంఎ్సపీ జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ముఖ్య అతిథిగా హాజరవుతారని పేర్కొన్నారు. విద్యార్థులు, నిరుద్యోగులు, శ్రామిక, కార్మికవర్గాలు పాల్గొనాలని కోరారు.