ముఖేష్ అంబాని ఇంట్లో కడియం నర్సిరీ చెట్లు
ABN , First Publish Date - 2021-11-27T00:06:42+05:30 IST
ప్రముఖ వ్యాపార వేత్త ముఖేష్ అంబానీ ఇంటిలో తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సిరీ చెట్లు కనువిందు చేయనున్నాయి.
కడియం: ప్రముఖ వ్యాపార వేత్త ముఖేష్ అంబానీ ఇంటిలో తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సిరీ చెట్లు కనువిందు చేయనున్నాయి. గుజరాత్లోని జామ్ నగర్లో అంబానీ నిర్మించే ఇంటి ఆవరణలో నాటేందుకు కడియం నుంచి రెండు ఆలివ్ చెట్లను ట్రాలీలో తరలించారు. ఒక్కో చెట్టు ధర రూ. 22 లక్షలని చెబుతున్నారు. రవాణ ఖర్చులకు మరో మూడు లక్షల రూపాయలు అవుతుందని నర్సిరీ నిర్వహాకులు తెలిపారు. ఈ చెట్లను గుజరాత్కు తరలించేందుకు ప్రత్యేకంగా ఓ ట్రాలీని ఏర్పాటు చేశారు.