సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ముక్కంటి ప్రసాదం
ABN , First Publish Date - 2021-06-20T05:10:20+05:30 IST
సుప్రీంకోర్డు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు శ్రీకాళహస్తి జడ్జి కోటేశ్వరరావు ముక్కంటి ప్రసాదాలు అందజేశారు.
శ్రీకాళహస్తి, జూన్ 19: సుప్రీంకోర్డు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు శ్రీకాళహస్తి కోర్టు అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కోటేశ్వరరావు ముక్కంటి ప్రసాదాలు అందజేశారు. హైదరాబాదులోని చీఫ్ జస్జిస్ నివాసంలో శుక్రవారం రాత్రి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన్ను ముక్కంటి శేషవస్త్రంతో సన్మానించి, స్వామి, అమ్మవార్ల తీర్థప్రసాదాలు, జ్ఞాపికను అందజేశారు. తెలుగుబిడ్డ దేశం గర్వించేస్థాయికి ఎదగడం అందరికీ గర్వకారణమని కోటేశ్వరరావు కొనియాడారు.