West Bengal: 24 మంది బీజేపీ ఎమ్మెల్యేలు టీఎంసీతో టచ్‌‌లో ఉన్నారు...

ABN , First Publish Date - 2021-09-07T14:55:41+05:30 IST

పశ్చిమబెంగాల్ రాష్ట్ర టీఎంసీ నాయకుడు ముకుల్ రాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు...

West Bengal: 24 మంది బీజేపీ ఎమ్మెల్యేలు టీఎంసీతో టచ్‌‌లో ఉన్నారు...

ముకుల్‌రాయ్ సంచలన వ్యాఖ్యలు 

కోల్‌కతా (పశ్చిమబెంగాల్): పశ్చిమబెంగాల్ రాష్ట్ర టీఎంసీ నాయకుడు ముకుల్ రాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.‘‘24 మంది బీజేపీ ఎమ్మెల్యేలు సీఎం మమతాబెనర్జీ నాయకత్వంలో పనిచేయడానికి నాతో టచ్‌‌లో ఉన్నారు...ఇంకా చాలామంది టీఎంసీలో చేరతారు.’’ అని ముకుల్ రాయ్ చెప్పారు. గతంలో బీజేపీ ఎమ్మెల్యే, ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షులుగా ఉన్న ముకుల్ రాయ్ టీఎంసీలో చేరారు.గత నాలుగు వారాల్లో నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలు, సౌమెన్ రాయ్, బిశ్వజిత్ దాస్,  తన్మోయ్ ఘోష్ లు టిఎంసీలో చేరారు. 


ఇటీవల మరో ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేలు కీలకమైన బెంగాల్ సమావేశానికి గైర్హాజరు కావడంతో ఫిరాయింపులపై ఊహాగానాలు చెలరేగుతున్నాయి.కాగా ముకుల్ రాయ్ వ్యాఖ్యలు అసంబద్ధమని బీజేపీ నేత రితేష్ తివారి చెప్పారు. ముకుల్ రాయ్ ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి పరస్పర విరుద్ధంగా చెబుతుంటాడని, కృష్ణానగర్ లో ఎన్నికలు జరిగితే బీజేపీ తన స్థానాన్ని గెలుచుకుంటుందని రితేష్ తివారీ పేర్కొన్నారు.


Updated Date - 2021-09-07T14:55:41+05:30 IST