ములుగు జిల్లా: గల్లంతైన యువకుల కోసం కొనసాగుతున్న గాలింపు

ABN , First Publish Date - 2021-08-02T15:49:30+05:30 IST

వాజేడు మండలం, కొంగాల జలపాతంలో నిన్న గల్లంతైన ఇద్దరు యువకుల కోసం గాలింపు చర్యలు...

ములుగు జిల్లా: గల్లంతైన యువకుల కోసం కొనసాగుతున్న గాలింపు

ములుగు జిల్లా: వాజేడు మండలం, కొంగాల జలపాతంలో నిన్న గల్లంతైన ఇద్దరు యువకుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పోలీసులు గజ ఈతగాళ్లతో వెతికిస్తున్నారు. నిన్న ఫ్రెండ్ షిప్‌ డే వేడుకల సందర్భంగా జలపాతానికి వచ్చిన యువకులు అరగంట వ్యవధిలోనే గల్లంతయ్యారు. ఇద్దరు యువకులు వేర్వేరు ప్రాంతాలకు చెందినవారు. ఒకరు భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన మునిగెల నరేష్ (24), మరో యువకుడు సంగారెడ్డి జిల్లా కొండాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న రవితేజ చారి(30)గా పోలీసులు గుర్తించారు.

Updated Date - 2021-08-02T15:49:30+05:30 IST