సీఎం కేసీఆర్ చేస్తోంది దొంగ దీక్ష: Sitakka

ABN , First Publish Date - 2021-11-18T18:05:59+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న దీక్ష దొంగ దీక్ష అని ఎమ్మెల్యే సీతక్క అన్నారు.

సీఎం కేసీఆర్ చేస్తోంది దొంగ దీక్ష: Sitakka

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న దీక్ష దొంగ దీక్ష అని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. గురువారం ఏబీఎన్‌తో మాట్లాడుతూ రైతాంగం నష్ట పోతుంది అనుకుంటే రాష్ట్రమే వడ్లు కొనాలన్నారు. పరిష్కార మార్గం చూపకుండా దీక్షలకు దిగడం సిగ్గు చేటని వ్యాఖ్యానించారు. కేంద్రం వడ్లు కొనకుండా నల్ల చట్టాలు అమలు చేస్తున్నపుడు ఏం చేశారని ప్రశ్నించారు. దమ్ముంటే ఢిల్లీలో దీక్షలు చేయాలని సవాల్ విసిరారు. ఢిల్లీలో దోస్తీ.. గల్లీలో కుస్తీలా ఉంది కేసీఆర్ పరిస్థితి అని అన్నారు. ఏడేళ్లుగా బీజేపీతో ఏడు అడుగులు నడిచారని సీతక్క వ్యాఖ్యలు చేశారు. 

Updated Date - 2021-11-18T18:05:59+05:30 IST