అబుదాబిలో కాలుపెట్టిన రోహిత్ శర్మ

ABN , First Publish Date - 2021-09-12T01:55:18+05:30 IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కోసం యూఏఈ ముస్తాబవుతోంది. ఇప్పటికే పలు ఫ్రాంచైజీలు అక్కడ ప్రాక్టీస్ సెషన్ కూడా

అబుదాబిలో కాలుపెట్టిన రోహిత్ శర్మ

అబుదాబి: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కోసం యూఏఈ ముస్తాబవుతోంది. ఇప్పటికే పలు ఫ్రాంచైజీలు అక్కడ ప్రాక్టీస్ సెషన్ కూడా మొదలుపెట్టాయి. వివిధ జట్ల ఆటగాళ్లు విడతల వారీగా దుబాయ్ చేరుకుంటున్నారు. ఇక, ఇంగ్లండ్‌తో జరగాల్సిన ఐదో టెస్టు రద్దు కావడంతో భారత ఆటగాళ్లు కూడా ఒక్కొక్కరుగా యూఏఈలో అడుగుపెడుతున్నారు.


రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రోహిత్ శర్మ చార్టర్ విమానంలో పేసర్ జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి నేడు అబుదాబి చేరుకున్నాడు. ముంబై ఇండియన్స్ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఇంగ్లండ్ నుంచి బయలుదేరడానికి ముందు ఆటగాళ్లకు నిర్వహించిన ఆర్టీ-పీసీఆర్ పరీక్షల్లో నెగటివ్ రిపోర్టులు వచ్చినట్టు తెలిపింది.


అబుదాబి చేరుకున్న తర్వాత మరోమారు ఆర్టీ-పీసీఆర్ టెస్టులు నిర్వహించినట్టు పేర్కొంది. ముంబై ఇండియన్స్ తన తొలి మ్యాచ్‌తో ఈ నెల 19న చెన్నైతో తలపడనుంది. షార్జాలో ఈ నెల 24న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ పార్ట్-2లో మ్యాచుల్లో 13 దుబాయ్‌లో, 10 షార్జాలో, 8 అబుదాబిలో జరగనున్నాయి. 

Updated Date - 2021-09-12T01:55:18+05:30 IST