టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్.. ఢిల్లీ ప్లే ఆఫ్స్కు చేరేనా?
ABN , First Publish Date - 2022-05-22T00:46:26+05:30 IST
ఢిల్లీ కేపిటల్స్తో జరగనున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పాయింట్ల
ముంబై: ఢిల్లీ కేపిటల్స్తో జరగనున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న రోహిత్ సేనకు ఈ మ్యాచ్లో గెలుపోటముల వల్ల కలిసొచ్చేది ఏమీ లేదు. గెలిస్తే నాలుగో విజయం అవుతుంది. ఓడితే 11వది అవుతుంది. అయితే, ఢిల్లీకి మాత్రం ఈ మ్యాచ్లో విజయం అత్యవసరం.
గెలిస్తేనే ఆ జట్టు ప్లే ఆఫ్స్కు చేరుకుంటుంది. ఓడితే కనుక నాలుగో స్థానంలో కాసుక్కూర్చున్న బెంగళూరుకు ఆ స్థానం ఖరారవుతుంది. కాబట్టి ఈ మ్యాచ్లో సర్వశక్తులు ఒడ్డాలని పంత్ సేన పట్టుదలగా ఉంది. ముంబై జట్టులో రెండు మార్పులు చోటుచేసుకున్నాయి. స్టబ్స్ స్థానంలో బ్రెవిస్, సంజయ్ ప్లేస్లో షాకీన్ జట్టులోకి వచ్చారు. ఢిల్లీ జట్టులో లలిత్ యాదవ్ స్థానంలో పృథ్వీషా జట్టులోకి వచ్చాడు.
కాగా, ఢిల్లీ జట్టుకు గత ఆరు మ్యాచుల్లో ఓపెనింగ్ భాగస్వామ్యం అంతగా కలిసి రావడం లేదు. గత మ్యాచుల్లో వరుసగా 0, 5, 0, 16, 0, 0 వద్ద తొలి వికెట్ను కోల్పోయింది. దీంతో ఈ మ్యాచ్లో ఓపెనింగ్ భాగస్వామ్యంపై ఢిల్లీ దృష్టి సారించే అవకాశం ఉంది. ఈ రెండు జట్లు ఇప్పటి వరకు తలపడిన మ్యాచుల్లో ముంబై 16సార్లు విజయం సాధించగా, ఢిల్లీ కేపిటల్స్ 15 సార్లు గెలుపొందింది. మరి ఈ మ్యాచ్లో పైచేయి ఎవరిదవుతుందో చూడాల్సిందే.