ఢిల్లీతో పోరు.. టాస్ గెలిచిన ముంబై

ABN , First Publish Date - 2021-04-21T00:50:27+05:30 IST

ఐపీఎల్‌లో భాగంగా నేడు ఢిల్లీ కేపిటల్స్-ముంబై ఇండియన్స్ మధ్య 13వ మ్యాచ్ జరగబోతోంది. టాస్ గెలిచిన

ఢిల్లీతో పోరు.. టాస్ గెలిచిన ముంబై

చెన్నై: ఐపీఎల్‌లో భాగంగా నేడు ఢిల్లీ కేపిటల్స్-ముంబై ఇండియన్స్ మధ్య 13వ మ్యాచ్ జరగబోతోంది. టాస్ గెలిచిన ముంబై బ్యాటింగ్ ఎంచుకుంది. రెండేసి విజయాలతో ఇరు జట్లు సమానంగా ఉన్నాయి. దీంతో ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా పాయింట్ల పట్టికలో పైకి ఎగబాకాలని భావిస్తున్నాయి. పరిస్థితులకు అనుగుణంగా జట్టులో మార్పులు చేసినట్టు ముంబై సారథి రోహిత్ పేర్కొన్నాడు. ఆడమ్ మిల్నే ఈ మ్యాచ్ ఆడడం లేదని, జయంత్ యాదవ్ జట్టులో చేరాడని చెప్పాడు. 


తాము టాస్ గురించి ఆలోచించడం లేదని ఢిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్ చెప్పుకొచ్చాడు. నిజానికి తమకు తొలుత బ్యాటింగ్ చేయడమే ఇష్టమని పేర్కొన్నాడు. తాము మంచి క్రికెట్ ఆడుతున్నట్టు చెప్పాడు. ఈ మ్యాచ్‌లో మెరివాలా, వోక్స్ ఆడడం లేదని, హెట్మెయెర్, అమిత్ మిశ్రా జట్టులోకి వచ్చారని పంత్ తెలిపాడు. 

Updated Date - 2021-04-21T00:50:27+05:30 IST