టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై

ABN , First Publish Date - 2021-04-18T00:39:35+05:30 IST

ఐపీఎల్ 14వ సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్-సన్‌రైజర్స్ హైదరాబద్ మధ్య మరికొద్ది సేపట్లో మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ టోర్నీలో తొలిసారి..

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై

చెన్నై: ఐపీఎల్ 14వ సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్-సన్‌రైజర్స్ హైదరాబద్ మధ్య మరికొద్ది సేపట్లో మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ టోర్నీలో తొలిసారి ఈ రెండు జట్లూ తలపడనున్నాయి. కాగా.. మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై బ్యాటింగ్ ఎంచుకుంది. తమ జట్టులో మార్కోకు బదులుగా ఆడమ్ మిల్నేను తీసుకున్నట్లు ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించాడు. కాగా.. సన్‌రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ మాట్లాడుతూ.. జట్టులో నాలుగు కీలక మార్పులు చేసినట్లు తెలిపాడు. వృద్ధిమాన్ సాహ, జేసన్ హోల్డర్, షాబాజ్ నదీమ్, టీ నటరాజన్‌లను జట్టులో నుంచి తొలగించామని, వారికి బదులుగా విరాట్ సింగ్, అభిషేక్ శర్మ, ఖలీల్ అహ్మద్, ముజీబుర్ రెహ్మాన్‌లను తీసుకున్నట్లు వెల్లడించాడు.



Updated Date - 2021-04-18T00:39:35+05:30 IST