సన్రైజర్స్ టార్గెట్ 151
ABN , First Publish Date - 2021-04-18T02:47:59+05:30 IST
ఐపీఎల్ 14వ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్-ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది. పవర్ ప్లేలో ముంబై ఓపెనర్లు..
చెన్నై: ఐపీఎల్ 14వ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్-ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది. పవర్ ప్లేలో ముంబై ఓపెనర్లు రోహిత్ శర్మ(32: 25 బంతుల్లో.. 2 ఫోర్లు, 2 సిక్స్లు), క్వింటన్ డీకాక్(40: 39 బంతుల్లో 5 ఫోర్లు) ధాటిగా ఆడి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అయితే ఆ పవన్ ప్లే పూర్తయిన వెంటనే ఎస్ఆర్హెచ్ ఆల్రౌండర్ విజయ్ శంకర్.. రోహిత్ శర్మను అవుట్ చేసి ముంబై వేగానికి బ్రేకులు వేశాడు. పొదుపుగా బౌలింగ్ చేశాడు. ఆ తర్వాత మిగతా బౌలర్లు కూడా పొదుపుగా బౌలింగ్ చేయడంతో ముంబై బ్యాట్స్మన్ పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డారు. సూర్యకుమార్ యాదవ్(10), ఇషాన్ కిషన్(12), హార్దిక్ పాండ్యా(7) వెంటవెటనే అవుట్ కావడంతో ముంబై కష్టాల్లో పడింది. అయితే చివర్లో కీరన్ పొలార్డ్(35: 22 బంతుల్లో.. 1 ఫోర్, 3 సిక్స్లు) కొద్దిగా బ్యాట్ ఝుళిపించడంతో సరిగ్గా 150 పరుగులు చేసింది. ఎస్ఆర్మెచ్ బౌలర్లలో ముజీబుర్ రెహ్మాన్, విజయ్ శంకర్లు చెరో రెండు వికెట్లు తీయగా.. ఖలీల్ అహ్మద్కు ఓ వికెట్ దక్కింది. మరికాసేపట్లో 151 పరుగుల లక్ష్యంతో సన్రైజర్స్ బరిలోకి దిగనుంది.