మౌత్వాష్ ఆర్డరిస్తే.. స్మార్ట్ఫోన్ వచ్చింది!
ABN , First Publish Date - 2021-05-15T18:53:59+05:30 IST
ఆన్లైన్లో కోల్గేట్ మౌత్వాష్ కావాలని ఆర్డర్ చేసిన వ్యక్తికి ఏకంగా 12,500 రూపాయల విలువ చేసే రెడ్మీ నోట్ 10 స్మార్ట్ఫోన్ వచ్చింది.
ముంబై: ఆన్లైన్లో కోల్గేట్ మౌత్వాష్ కావాలని ఆర్డర్ చేసిన వ్యక్తికి ఏకంగా 12,500 రూపాయల విలువ చేసే రెడ్మీ నోట్ 10 స్మార్ట్ఫోన్ వచ్చింది. దీంతో సదరు వ్యక్తి షాకయ్యాడు. అయితే దానిని తన వద్దే ఉంచుకోకుండా కంపెనీ వాళ్లకు జరిగిన విషయం చెప్పే ప్రయత్నం చేశాడు. ఆ విషయాన్ని ట్విటర్ ద్వారా వెల్లడించాడు.
ముంబైకి చెందిన లోకేష్ అనే వ్యక్తి అమేజాన్ యాప్ ద్వారా 369 రూపాయల విలువ చేసే మౌత్ వాష్కు ఆర్డరిచ్చాడు. అయితే అతనికి 12,500 రూపాయల విలువ చేసే రెడ్మీ నోట్ 10 స్మార్ట్ఫోన్ వచ్చింది. బాక్సులోని ఇన్ వాయిస్ చూస్తే తెలంగాణకు చెందిన వ్యక్తి పేరు, అడ్రస్ ఉంది. దీంతో మెయిల్ ద్వారా కంపెనీని సంప్రదించి జరిగిన విషయం చెప్పాడు. ఆ ప్రొడక్ట్ను తన దగ్గర నుంచి తీసుకొని సరైన వ్యక్తికి అందించాలని ఇప్పటికే అమేజాన్కు మెయిల్ కూడా పంపానని లోకేశ్ ట్వీట్ చేశాడు. అతడి నిజాయితీపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.