UAE నుంచి ముంబై వచ్చే వారికి ఊరట.. ఆ నిబంధన తొలగింపు..

ABN , First Publish Date - 2022-01-18T14:53:15+05:30 IST

యూఏఈ నుంచి ముంబై వచ్చే ప్రయాణికులకు భారీ ఊరటనిచ్చే నిర్ణయం తీసుకున్నారు అక్కడి అధికారులు.

UAE నుంచి ముంబై వచ్చే వారికి ఊరట.. ఆ నిబంధన తొలగింపు..

ముంబై: యూఏఈ నుంచి ముంబై వచ్చే ప్రయాణికులకు భారీ ఊరటనిచ్చే నిర్ణయం తీసుకున్నారు అక్కడి అధికారులు. యూఏఈ, దుబాయ్ నుంచి వచ్చే ప్రయాణికులకు ఇకపై పీసీఆర్ టెస్టు ఉండదు. అలాగే ఏడు రోజుల తప్పనిసరి హోం క్వారంటైన్ నిబంధనను కూడా తొలగించారు. సోమవారం(జనవరి 17) నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని సంబంధిత అధికారులు వెల్లడించారు. కాగా, కరోనా కొత్త వేరియంట్ ఒమైక్రాన్ నేపథ్యంలో యూఏఈ నుంచి ముంబై వచ్చే ప్రయాణికులకు గతేడాది డిసెంబర్ 29 నుంచి ఎయిర్‌పోర్టుకు రాగానే పీసీఆర్ టెస్టు, 7రోజుల హోం క్వారంటైన్ నిబంధనను బీఎంసీ(బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్) అధికారులు అమలు చేస్తున్నారు. తాజాగా ఈ నిబంధనను తొలగించారు. ముంబై అధికారులు తీసుకున్న ఈ నిర్ణయం పట్ల యూఏఈ, దుబాయ్ నుంచి వచ్చే ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  

Updated Date - 2022-01-18T14:53:15+05:30 IST