లాక్‌డౌన్‌లో ‘సమోసా పార్టీ’.. నిర్వాహకుల అరెస్టు!

ABN , First Publish Date - 2020-05-21T04:05:03+05:30 IST

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో ఈ వైరస్ విలయతాండవం చూపిస్తోంది.

లాక్‌డౌన్‌లో ‘సమోసా పార్టీ’.. నిర్వాహకుల అరెస్టు!

ముంబై: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో ఈ వైరస్ విలయతాండవం చూపిస్తోంది. దీన్ని నిలువరించడానికి ప్రభుత్వాలు లాక్‌డౌన్ విధించి, ప్రజలకు జాగ్రత్తలు చెప్తున్నాయి. అయితే కరోనాతో అల్లాడుతున్న ముంబై నగరంలోని ఘట్కోపర్ ప్రాంతానికి చెందిన ఓ హౌసింగ్ సొసైటీ లాక్‌డౌన్ నిబంధనలను గంగలో కలిపేసింది. అందరూ కలిసి గానాబజానా ఏర్పాటు చేసుకొని సమోసా పార్టీ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. దాదాపు 30మంది సభ్యులు ఈ పార్టీలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. సదరు హౌసింగ్ సొసైటీ చైర్మన్, పార్టీ నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - 2020-05-21T04:05:03+05:30 IST