నల్లబ్యాడ్జీలతో మున్సిపల్ కార్మికుల నిరసన
ABN , First Publish Date - 2022-01-29T04:39:10+05:30 IST
ప్రభుత్వ నూతన పీఆర్సీ జీవోను వ్యతిరేకిస్తూ సూళ్లూరుపేట మున్సిపల్ కార్మికులు శుక్రవారం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.
సూళ్లూరుపేట, జనవరి 28 : ప్రభుత్వ నూతన పీఆర్సీ జీవోను వ్యతిరేకిస్తూ సూళ్లూరుపేట మున్సిపల్ కార్మికులు శుక్రవారం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. కార్మిక నేతలు వెంకటరత్నం, బాబు, చెంగయ్య, చిన్నయ్య, చెంగమ్మ, తదితరుల ఆధ్వర్యాన ఈ కార్యక్రమం జరిగింది.
పీఆర్సీ నూతన జీవోను రద్దు చేయాలి
నాయుడుపేట టౌన్ : నూతన పీఆర్సీ జీవోను రద్దుచేసి పాత జీవోను అమలు చేయాలని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. నాయుడుపేటలోని సీఐటీయూ కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆప్కాస్ కాంట్రాక్ట్ పద్ధతిని రద్దుచేసి కార్మికులను పర్మినెంట్ చేయడంతోపాటు సమానపనికి సమానవేతనం ఇవ్వాలన్నారు. ఈ నెల 31న చలో విజయవాడ కార్యక్రమంలో, ఫిబ్రవరి ఒకటి నుంచి రిలేనిరాహారదీక్షలు, ఫిబ్రవరి 7 నుంచి జరిగే రాష్ట్ర వ్యాప్త నిరవధిక సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మున్సిపల్ కార్మికుల సంఘ నాయకులు రవిచంద్రబాబు, శీనయ్య, మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు.