ఫుట్‌రైలింగ్‌ పనులను పరిశీలించిన మున్సిపల్‌ చైర్మన్‌

ABN , First Publish Date - 2021-06-19T05:30:00+05:30 IST

రోడ్డువెడల్పు, సుందరీ కరణలో భాగంగా ఫుట్‌రైలింగ్‌ పనులను శనివారం మున్సిపల్‌ చైర్మన్‌ గండ్రత్‌ ఈశ్వర్‌ పరిశీలించారు.

ఫుట్‌రైలింగ్‌ పనులను పరిశీలించిన మున్సిపల్‌ చైర్మన్‌
ఫుట్‌రైలింగ్‌ పనులను పరిశీలిస్తున్న మున్సిపల్‌ చైర్మన్‌ గండ్రత్‌ ఈశ్వర్‌

నిర్మల్‌టౌన్‌, జూన్‌ 19 : రోడ్డువెడల్పు, సుందరీ కరణలో భాగంగా ఫుట్‌రైలింగ్‌ పనులను శనివారం మున్సిపల్‌ చైర్మన్‌ గండ్రత్‌ ఈశ్వర్‌ పరిశీలించారు. నిర్మల్‌ పట్టణంలోని జరుగుతున్న అభివృద్ధి పనుల్లో భాగంగా ఫుట్‌రైలింగ్‌ ప్రయాణికులకు ఇబ్బంది కలు గకుండా 2, 4 వీల్లర్ల పార్కింగ్‌ ఎక్కడెక్కడ ఇవ్వాల్సి ఉంటుందని ఆడిగి తెలుసుకున్నారు. ఫుట్‌ రైలింగ్‌పై సాయంత్రం సమయంలో విశ్రాంతి కొరకు కూర్చోటా నికి ఏర్పాటు చేస్తున్న సిట్టింగ్‌చైర్స్‌ (దిమ్మెలను) పరి శీలించారు. ఈ కార్యక్రమంలో ఏఈ వినయ్‌కుమార్‌, కౌన్సిలర్‌, రఫీ, ముజ్జు, కోఆప్షన్‌ సల్మాన్‌, లింగంపల్లి లక్ష్మినారాయణ, పద్మనాభం, తదితరులు పాల్గొన్నారు. 

కార్మికులకు శానిటైజర్‌ బాటిళ్ల పంపిణీ

నిర్మల్‌ కల్చరల్‌, జూన్‌ 19 : శనివారం మున్సిపల్‌ పారిశుద్ధ్య కార్మికులకు చైర్మన్‌ ఈశ్వర్‌ శానిటైజర్‌ బా టిల్స్‌ అందజేశారు. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ విధు లు నిర్వహించాలని చైర్మన్‌ అన్నారు. కమిషనర్‌ బాల కృష్ణ, సానిటరీ ఇన్స్‌పెక్టర్‌ రవీందర్‌, కౌన్సిలర్లు నల్లూ రి పోశెట్టి, గండ్రత్‌ రమణ, ముజ్జు, రఫీ, సిబ్బంది పా ల్గొన్నారు. 


Updated Date - 2021-06-19T05:30:00+05:30 IST