మున్సిపల్ ఉద్యోగులకు పూర్తి వేతనాలివ్వాలి
ABN , First Publish Date - 2020-04-08T09:39:09+05:30 IST
కరోనా వైరస్ నిరోధానికి 24 గంటలూ శ్రమిస్తున్న పట్టణ స్థానిక సంస్థల ఉద్యోగులందరికీ మార్చి నెల వేతనాలు పూర్తిగా ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ మినిస్టీరియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరింది.
అమరావతి, ఏప్రిల్ 7(ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్ నిరోధానికి 24 గంటలూ శ్రమిస్తున్న పట్టణ స్థానిక సంస్థల ఉద్యోగులందరికీ మార్చి నెల వేతనాలు పూర్తిగా ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ మినిస్టీరియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరింది. అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్.కృష్ణమోహనరావు ఈ మేరకు పురపాలకశాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్కు విజ్ఞప్తి చేశారు.