మున్సిపల్‌ కార్మికుల దర్నా

ABN , First Publish Date - 2022-01-28T03:13:52+05:30 IST

సమస్యలు పరిష్కరించాలంటూ ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్‌ కార్యాలయం ఎదుట గురువారం కార్మికులు ధర్నా చేశారు.

మున్సిపల్‌ కార్మికుల దర్నా
మున్సిపల్‌ కార్యాలయం ఎదుట కార్మికుల ధర్నా

వెంకటగిరి, జనవరి 27:  సమస్యలు పరిష్కరించాలంటూ ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్‌ కార్యాలయం ఎదుట గురువారం కార్మికులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి జాన్‌ మాట్లాడుతూ పాత పీఆర్సీని రద్దు చేసి 11వ పీఆర్సీ ప్రకారం వేతనాల చెల్లింపు, కాంట్రాక్టు కార్మికుల ఉద్యోగాలు పర్మనెంట్‌ చేయడం తదితర సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో సమ్మె బాట పట్టనున్నట్లు హెచ్చరిం చారు. అనంతరం మున్సిపల్‌ మేనేజర్‌ శారదాదేవికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాలాజీ, నరేష్‌, చలపతి, కందప్ప తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-01-28T03:13:52+05:30 IST