మునిసిపల్‌ కార్మికుల ఆందోళన

ABN , First Publish Date - 2020-12-04T04:36:47+05:30 IST

రాష్ట్రంలో క్వారంటైన్‌ కేంద్రాలలో పనిచేసిన పారిశుధ్య కార్మికులకు ఐదు నెలలుగా వేతన బకాయిలు చెల్లించాలని ఏఐటీయూసీ నాయకులు చెల్లబోయిన రంగారావు, వైకుంఠరావు అన్నారు.

మునిసిపల్‌ కార్మికుల ఆందోళన

భీమవరం, డిసెంబరు 3: రాష్ట్రంలో క్వారంటైన్‌ కేంద్రాలలో పనిచేసిన పారిశుధ్య కార్మికులకు ఐదు నెలలుగా వేతన బకాయిలు చెల్లించాలని ఏఐటీయూసీ నాయకులు చెల్లబోయిన రంగారావు, వైకుంఠరావు అన్నారు. మున్సిపల్‌ వర్కర్స్‌ జేఏసీ పిలుపు మేరకు మున్సిపల్‌ కార్మికులు, కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది  గురువారం ధర్నా నిర్వహించారు. కార్మికులను పర్మినెంట్‌ చేయాలని, పెండింగ్‌జీతాలు వెంటనే ఇవ్వాలన్నారు. నూతన పీఆర్‌సీ విడుదల చేయాలని, సచివాలయాలకు పారిశుధ్య కార్మికుల బదిలీ ఆపాలని, సీపీఎస్‌ విధానం రద్దు చేయాలన్నారు. కరోనాతో మరణించిన వారి కుటుంబాలకు రూ.50లక్షలు చెల్లింపు జీవో విడుదల చేయాలన్నారు. మునిసిపల్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ జ్యోతిలక్ష్మికి మెమోరాండం సమర్పించారు. నీలపు శ్రీను, రెల్ల రాము, సత్యనారాయణ, సీఐటీయూ నాయకులు నీలపు రాజు, రాజ్యలక్ష్మీ, కార్మికులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-04T04:36:47+05:30 IST