కార్మికులకు బకాయిలు చెల్లించాలి

ABN , First Publish Date - 2021-06-24T04:51:48+05:30 IST

అప్కాస్‌ నుంచి మునిసిపల్‌ కార్మికులను మినహాయించి పెండింగ్‌ బకాయిలను కార్మికుల ఖాతాల్లో జమ చేయాలని ఏఐటీయూసీ నాయకులు మన్నవ కృష్ణ చైతన్య డిమాండ్‌ చేశారు.

కార్మికులకు బకాయిలు చెల్లించాలి
పారిశుధ్య కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ ధర్నా

జంగారెడ్డిగూడెం, జూన్‌ 23 : అప్కాస్‌ నుంచి మునిసిపల్‌ కార్మికులను మినహాయించి పెండింగ్‌ బకాయిలను కార్మికుల ఖాతాల్లో జమ చేయాలని ఏఐటీయూసీ నాయకులు మన్నవ కృష్ణ చైతన్య డిమాండ్‌ చేశారు.  జంగా రెడ్డిగూడెం మున్సిపల్‌ కార్యాలయం వద్ద కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ బుధవారం ధర్నా నిర్వహించారు. కృష్ణ చైతన్య మాట్లాడుతూ మునిసిపల్‌ పారిశుధ్య కార్మికులు ప్రాణాలను తెగించి కరోన కష్టకాలంలో పట్టణాన్ని శుభ్రం చేస్తుంటే వారికి మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో కుంచే వసంతరావు, ముత్యాలరావు, వెంకట్రావు, కొత్తూరి విగ్నేష్‌, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-24T04:51:48+05:30 IST