పెండింగ్ జీతాలు విడుదల చేయాలి
ABN , First Publish Date - 2021-03-04T05:19:42+05:30 IST
మున్సిపల్ కార్మికులకు గత ఏడాది ఆగస్టు నుంచి చెల్లించాల్సిన జీతాలు, క్వారంటైన్లో విధులు నిర్వహించిన కార్మికుల జీతాలు వెంటనే ఇవ్వాలని కిల్లరి మల్లేశ్వరరావు డిమాండ్ చేశారు.
భీమవరం అర్బన్, ఫిబ్రవరి 3: మున్సిపల్ కార్మికులకు గత ఏడాది ఆగస్టు నుంచి చెల్లించాల్సిన జీతాలు, క్వారంటైన్లో విధులు నిర్వహించిన కార్మికుల జీతాలు వెంటనే ఇవ్వాలని కిల్లరి మల్లేశ్వరరావు డిమాండ్ చేశారు. సీఐటీయూ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద బుధ వారం రిలే నిరసన దీక్షలు, ధర్నా నిర్వహించారు. జెఎన్వీగోపాలన్, చెల్లబోయిన రంగారావు మాట్లాడుతూ కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాం డ్ చేశారు. 37 మంది కార్మికులకు 7నెలలుగా జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎం సీతారాం ప్రసాద్, అకలి రాము, బి.వాసుదేవరావు, నీలపు శ్రీను, రెల్లి రాము తదితరులు పాల్గొన్నారు.