మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

ABN , First Publish Date - 2022-01-29T05:11:47+05:30 IST

మున్సిపల్‌ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కార్మిక సంఘ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
మున్సిపల్‌ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న కార్మికులు

బద్వేలు, జనవరి28: మున్సిపల్‌ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కార్మిక సంఘ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆ మేర కు  శుక్రవారం కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి స్థానిక మున్సిపల్‌ కార్యాలయం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా  యూనియన్‌ పట్టణ కార్యదర్శి కె.శివకుమార్‌ మాట్లాడుతూ ప్రపంచ విపత్తు కరోనా నేపథ్యంలో ఫ్రంట్‌లైన్‌ వర్కర్లుగా  పనిచేసిన మున్సిపల్‌ కార్మికుల సేవలు వెలకట్టలేవని, ఏ మి ఇచ్చినా రుణం తీర్చుకోలేనిదని గొప్పలు చెబుతున్న ప్రభుత్వాలు కార్మికులను పర్మినెంట్‌ చేయడంలో విఫలమయ్యారన్నారు.  జీవో నంబరు 7ను ఉపసంహరించుకుని 1615 ప్రకారం కరువు భత్యం, మధ్యంతర భృతి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్‌ రాష్ట్ర కార్యదర్శి నాగేంద్రబాబు,  యూనియన్‌ పట్టణ అధ్యక్షులు శ్రీనివాసులు కార్యనిర్వాహక అధ్యక్షులు హరి, ఉపాఽధ్యక్షురాలు దేవమ్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-29T05:11:47+05:30 IST