రాస్‌లో మునిరత్నం కర్మక్రియలు

ABN , First Publish Date - 2021-05-17T06:38:48+05:30 IST

తిరుపతి ఎయిర్‌ బైపాస్‌ రోడ్డులోని రాస్‌ సేవా నిలయంలో పద్మశ్రీ డాక్టర్‌ గుత్తా మునిరత్నం కర్మక్రియలు ఆదివారం నిర్వహించారు.

రాస్‌లో మునిరత్నం కర్మక్రియలు
మునిరత్నం చిత్రపటానికి హారతి ఇస్తున్న వెంకటరత్నం

తిరుపతి(కొర్లగుంట), మే 16: తిరుపతి ఎయిర్‌ బైపాస్‌ రోడ్డులోని రాస్‌ సేవా నిలయంలో పద్మశ్రీ డాక్టర్‌ గుత్తా మునిరత్నం కర్మక్రియలు ఆదివారం నిర్వహించారు. ఆయన అల్లుడు, రాస్‌ ప్రధాన కార్యదర్శి ఎస్‌.వెంకటరత్నం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ హాజరయ్యారు. అలాగే ప్రాజెక్టు డైరెక్టర్‌ వి.నాగరాజు, సంయుక్త కార్యదర్శులు ఎం.మమత, సమత, బాలాజీనాయుడు, ఎం.విజయకుమార్‌, గోవిందధామం సంఘ సభ్యుడు దామోదరం హాజరై.. మునిరత్నం చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. కాగా.. రాస్‌ పీఆర్వో మునినాదం ఆధ్వర్యంలో నగరం నలుమూలలా దాదాపు 1500 మందికి అన్నదానం చేశారు. రుయాస్పత్రి వద్ద 300మందికి ఆహార పొట్లాలను అందించారు. రాస్‌ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-17T06:38:48+05:30 IST