మహిళ కాళ్లు నరికి నిప్పంటించిన దుండగులు
ABN , First Publish Date - 2020-09-30T00:16:52+05:30 IST
మహిళ కాళ్లు నరికి నిప్పంటించిన దుండగులు
రంగారెడ్డి: ఇబ్రహీంపట్నం మండలం కోహెడ రోడ్డులో మహిళ హత్యకు గురైంది. మహిళ కాళ్లు నరికి దుండగులు నిప్పంటించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. వనస్థలిపురానికి చెందిన మైసమ్మ(60)గా గుర్తించారు. కాళ్ల కడియాల కోసం హత్య చేసి ఉంటారని పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల క్రితం వనస్థలిపురం పీఎస్లో మిస్సింగ్ కేసు నమోదైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.