అత్తను చంపిన కోడలు

ABN , First Publish Date - 2020-12-04T05:00:16+05:30 IST

నీటిలో పురుగుల మందు కలిపి అత్తను కోడలు హత్య చేసిన సంఘటన మండలంలోని అప్పారెడ్డి పల్లి గ్రామంలో గురువారం జరిగింది.

అత్తను చంపిన కోడలు

- అప్పారెడ్డిపల్లిలో ఘటన

    ఖిల్లాఘణపురం, డిసెంబరు 3 : నీటిలో పురుగుల మందు కలిపి అత్తను కోడలు హత్య చేసిన సంఘటన మండలంలోని అప్పారెడ్డి పల్లి గ్రామంలో గురువారం జరిగింది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాలు.. అప్పారెడ్డి పల్లి గ్రామానికి చెందిన సొంటం పెంటమ్మ(65) ఇంటి దగ్గరనే ఉంటూ పింఛన్‌ డబ్బుతో జీవించేది. కొన్ని రోజుల క్రితం ఒక్కగానొక్క కుమారుడు మరణించాడు. కోడలు నాగమ్మ ఇద్దరు కుమారులతో ఆమె కలిసి ఉంటోంది. ఈ నేపథ్యంలో వృద్ధురాలైన అత్తను వదిలించుకోవాలని కోడలు నాగమ్మ గులికల మందు తెప్పించి గురువారం ఉదయం అన్నంలో, తాగే నీటిలో కలిపింది. విషయం తెలియని పెంటమ్మ అన్నం తిని, నీళ్లు తాగింది. ఉదయం 11 గంటల సమయంలో ఆమె అవస్థ పడుతుం డగా చుట్టు పక్కల వారు గమనించి మహబూబ్‌నగర్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పెంటమ్మ మృతి చెందింది. తెలిపారు. కోడలిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్‌ఐ రామస్వామి తెలిపారు. 


Updated Date - 2020-12-04T05:00:16+05:30 IST