అనుమానంతో చంపేశాడు..!

ABN , First Publish Date - 2020-12-04T06:06:02+05:30 IST

అనుమానంతో భార్య పీక నులిమి హత్య చేశాడో భర్త.

అనుమానంతో చంపేశాడు..!
మృతదేహాన్ని పరిశీస్తున్న పోలీసులు

మొగల్తూరు, డిసెంబరు 3 : అనుమానంతో భార్య పీక నులిమి హత్య చేశాడో భర్త. మొగల్తూరు మండలం ముత్యాలపల్లి పంచాయతీ చింతరేవులో బుధవారం అర్ధరాత్రి జరిగింది. నరసాపురం సీఐ కృష్ణకుమార్‌ తెలిపిన వివరాలివి.. చింతరేవుకు చెందిన తమ్ము సత్యనారాయణకు తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలం కత్తిమండకు చెందిన ఏస్తేరు జ్యోతితో రెండున్నరేళ్ల క్రితం వివాహమైంది. గతంలోనే సత్యనారాయణకు వివాహమై.. భార్య రోడ్డు ప్రమాదంలో మరణించింది. వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అలాగే ఎస్తేరుకు కూడా మేనమామతో వివాహమవగా మూడేళ్ల క్రితం భర్త మరణించాడు. వారికి ఇద్దరు కుమారులున్నారు. ఈ నేపథ్యంలో రెండేళ్ల క్రితం ఎస్తేరు, సత్యనారాయణ పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి భార్యను వేధిస్తున్నాడు. నాలుగు మాసాలుగా అత్తవారింటిలో ఉన్న భార్య భర్తలిరువురు బుధవారం చింతరేవులోని తమ ఇంటికి వచ్చారు. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో భార్యను పీక నులిమి హత్య చేశాడు. అయితే ఆమె బాత్‌ రూమ్‌లో కాలు జారి చనిపోయిందని చిత్రీకరించాడు. ఎస్తేరు తాత కొల్లు బాబాయ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

Updated Date - 2020-12-04T06:06:02+05:30 IST