అన్నదాతపై హత్యాయత్నం.. న్యాయవాదికి యావజ్జీవ ఖైదు

ABN , First Publish Date - 2020-09-19T17:34:35+05:30 IST

నామక్కల్‌ సమీపంలో అన్నదాతపై హత్యాయత్నానికి పాల్పడిన కేసులో న్యాయవాదికి న్యాయస్థానం యావజ్జీవ జైలుశిక్ష విధించింది. నామక్కల్‌ జిల్లా బోడినాయకన్‌పట్టి సమీపంలోని గజకొంబు ప్రాంతానికి చెందిన రైతు

అన్నదాతపై హత్యాయత్నం.. న్యాయవాదికి యావజ్జీవ ఖైదు

చెన్నై : నామక్కల్‌ సమీపంలో అన్నదాతపై హత్యాయత్నానికి పాల్పడిన కేసులో న్యాయవాదికి న్యాయస్థానం యావజ్జీవ జైలుశిక్ష విధించింది. నామక్కల్‌ జిల్లా బోడినాయకన్‌పట్టి సమీపంలోని గజకొంబు ప్రాంతానికి చెందిన రైతు సతీష్‌కుమార్‌ (27), సేందమంగళం సమీపం ముత్తుక్కాడు చెందిన న్యాయవాది రవికుమార్‌ (36)ల మధ్య స్థలానికి సంబంధించిన వివాదం కక్షలకు దారితీసింది. 2017 అక్టోబరు 19న రవికుమార్‌, అతని మద్దతుదారులు సతీష్‌కుమార్‌పై దాడిచేయడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై ఎరుంపట్టి పోలీసులు హత్యాయత్నం కేసు నమోదుచేసి రవికుమార్‌ సహా ఆరుగురిని అరెస్టు చేశారు. అలాగే, ఈ ఘటనలో రవికుమార్‌పై అంటరానితనం నిర్మూలన చట్టం కింద కూడా కేసు నమోదైంది. ఈ కేసు విచారణ నామక్కల్‌ జిల్లా ఎస్పీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానంలో జరిగింది. ఈ కేసు వాదోపవాదాలు ముగియడంతో న్యాయమూర్తి గుణశేఖరన్‌ వెలువరించిన తీర్సులో, న్యాయవాది రవికుమార్‌కు యావజ్జ్జీవ శిక్ష, రూ.1,000 జరిమానా విధించడంతో పాటు బాధితుడికి పరిహారంలో రూ.50 వేలు అందించాలని ఆదేశించారు. ఈ ఘటనలో నిందితులుగా ఉన్న మరో ఐదుగురిపై ఆరోపణలు నిరూపణ కాకపోవడంతో వారిని విడుదల చేస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు.

Updated Date - 2020-09-19T17:34:35+05:30 IST