మద్యానికి డబ్బులివ్వలేదని కన్నతల్లిని...

ABN , First Publish Date - 2021-03-25T17:13:03+05:30 IST

చిత్తూరు: కుప్పం మండలం బండశెట్టిపల్లిలో దారుణం చోటు చేసుకుంది. మద్యం సేవించేందుకు డబ్బులు ఇవ్వలేదంటూ

మద్యానికి డబ్బులివ్వలేదని కన్నతల్లిని...

చిత్తూరు: కుప్పం మండలం బండశెట్టిపల్లిలో దారుణం చోటు చేసుకుంది. మద్యం సేవించేందుకు డబ్బులు ఇవ్వలేదంటూ కన్నతల్లి విజయకుమారి(64)ని కొడుకు శ్రీధర్ దారుణంగా కొట్టాడు. వృద్ధురాలి ఎడమ చెయ్యి విరచి.. తలా, ముఖంపై అతి కిరాతంగా కొట్టాడు. ప్రస్తుతం విజయకుమారి పరిస్థితి విషమంగా ఉంది. ఆమెను చికిత్స నిమిత్తం కుప్పం ఏరియా ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శ్రీధర్‌ను అదుపులోకి తీసుకున్నారు.


Updated Date - 2021-03-25T17:13:03+05:30 IST