సౌదీలో తెలుగు వ్య‌క్తికి అనుకోని క‌ష్టాన్ని తెచ్చిపెట్టిన 'క‌రోనా'..!

ABN , First Publish Date - 2020-04-09T20:03:35+05:30 IST

సౌదీ అరేబియాలో క‌రోనావైర‌స్‌(కొవిడ్‌-19) విజృంభిస్తోంది. రోజురోజుకీ క‌రోనా కేసులు పెరిగి పోతున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు సౌదీలో 2,932 మంది క‌రోనా బాధితులు ఉండ‌గా, 41 మంది మృత్యువాత ప‌డ్డారు.

సౌదీలో తెలుగు వ్య‌క్తికి అనుకోని క‌ష్టాన్ని తెచ్చిపెట్టిన 'క‌రోనా'..!

రియాధ్: సౌదీ అరేబియాలో క‌రోనావైర‌స్‌(కొవిడ్‌-19) విజృంభిస్తోంది. రోజురోజుకీ క‌రోనా కేసులు పెరిగి పోతున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు సౌదీలో 2,932 మంది క‌రోనా బాధితులు ఉండ‌గా, 41 మంది మృత్యువాత ప‌డ్డారు. దీంతో సౌదీ స‌ర్కార్‌ ఈ వైర‌స్ క‌ట్ట‌డికి క‌ఠిన చ‌ర్య‌లు చేప‌ట్టింది. ప్ర‌జ‌ల‌ను ఇళ్ల‌కు ప‌రిమితం చేయ‌డంతో పాటు బ‌హిరంగ ప్ర‌దేశాల్లో జ‌న‌స‌మూహాలు, ఉమ్మివేయ‌డాన్ని పూర్తిగా నిషేధించింది. ఇదిలాఉంటే తాజాగా సౌదీలో ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాకు చెందిన ఓ వ్య‌క్తిపై క‌రోనా నేప‌థ్యంలోనే హ‌త్య‌ అభియోగం మోప‌బ‌డింది.


కరోనా వ్యాప్తికి కారణమంటూ సౌదీలో ప్రవాసీపై ఈ అభియోగాలు మోపారు. మార్కెట్‌కు వెళ్లిన ప్ర‌వాసీ పొరపాటున తుమ్మి సామాన్లను ముట్టుకోవడం చూసిందో అరబ్బు చిన్నారి. దాంతో బెదిరిపోయిన ఆ చిన్నారి పెద్ద‌గా అరిచింది. బాలిక‌ కేకలపై రంగంలో దిగిన పోలీసులు.. తెలుగు వ్య‌క్తిని అదుపులోకి తీసుకొని వైద్య పరీక్షలకు తరలించారు. ఈ వైద్య ప‌రీక్ష‌ల్లో ప్ర‌వాసీయుడికి క‌రోనా సోకిన‌ట్లు తేలింది. దీంతో కరోనా వ్యాప్తికి కారణమయ్యాడంటూ సౌదీలో  అత‌నిపై హత్య అభియోగాలు మోప‌బ‌డ్డాయి. ఇలా తెలుగు వ్య‌క్తికి క‌రోనా అనుకోని క‌ష్టాన్ని తెచ్చిపెట్టింది.  

Updated Date - 2020-04-09T20:03:35+05:30 IST